ప్రారంభమైన నాయిని అంతిమయాత్ర.. వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు...

Oct 22, 2020, 2:32 PM IST

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరుగుతున్నాయి. మినిస్టర్ క్వార్టర్స్‌ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. నాయిని నర్సింహారెడ్డి అంతిమ యాత్రలో  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.