చంద్రబాబు శిష్యుడే రేవంత్... ఇలా కాకుంటే ఇంకేలా మాట్లాడతాడు..: ఇంద్రకరణ్ రెడ్డి

Jul 12, 2023, 4:00 PM IST

హైదరాబాద్ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల బ్రతుకులు బాగుపడుతుంటే రేవంత్ రెడ్డి లాంటి చంద్రబాబు శిష్యులు చూడలేకపోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అందుకే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆనాడు చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపించారని... ఈనాడు ఆయన శిష్యుడు రేవంత్ రైతులకు ఉచిత కరెంట్ వద్దంటున్నాడని అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులంటే కాంగ్రెస్ పార్టీకి మొదటినుండి కండ్లమంటే... ఆ విషయం రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి బయటపడిందన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ మేరకు నిర్మల్ లోని విద్యుత్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ ముందు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత నిరసన చేపట్టారు.