మున్సిపల్ సిబ్బందితో సహపంక్తి భోజనం చేసిన గంగుల కమలాకర్

May 4, 2020, 3:43 PM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సహపంక్తి భోజనం చేశారు. కరోనా నియంత్రణలో మెరుగైన సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి మంత్రి గంగుల కమలాకర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, మేయర్ సునీల్ రావు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.