తెలంగాణ సచివాలయానికి కేరళ స్పీకర్ (వీడియో)

Jul 10, 2019, 10:59 AM IST

తెలంగాణ రాష్ట్ర శాసనసభను కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్  పి. శ్రీరామకృష్ణన్ మంగళవారంనాడు సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర  శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. 

హైదరాబాద్ పర్యటనలో భాగంగా రామకృష్ణన్ తెలంగాణ శాసనసభను సందర్శించారు.శాసనసభ సమావేశాల నిర్వాహణ, ఇతర అంశాలపై ఇరువురు స్పీకర్లు మాట్లాడుకున్నారు. కేరళ స్పీకర్ ని పోచారం శాలువా, మోమొంటోతో సత్కరించారు. శాసనసభ్యులు హన్మంత్ షిండే, విఠల్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు స్పీకర్ కూడా ఉన్నారు.