కేసీఆర్ ను కదిలించిన శరత్ వీడియో పోస్టు ఇదే...(వీడియో)

Mar 27, 2019, 5:58 PM IST

సాగు చేసుకునే భూమిని VRO సాయంతో కొందరు లాగేసుకున్నారని ఓ యువరైతు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో కొండపల్లి శంకరయ్య అనే రైతుకు సంబంధించిన ఏడెకరాల భూమిని కొందరు లాగేసుకున్నారని ఆయన కుమారుడు శరత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు.

ఈ వ్యవహారానికి వీఆర్‌ఓ సైతం సహకరించాని ఫిర్యాదు చేశారు. దీన్ని చూసిన సీఎం కేసీఆర్‌ - వెంటనే స్పందించాడు. స్వయంగా యువరైతుతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సదరు యువరైతుకు చెప్పారు.