భారీ వర్షానికి వాగులైన కొనుగోలు కేంద్రాలు.. తల పట్టుకున్న రైతులు...

May 30, 2020, 12:08 PM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన బారి వర్షం కురిసింది. అనుకోని వర్షాలకు కొనుగోలు కేంద్రాలలో ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రం చిన్పపాటి వాగును తలపిస్తోంది. ఇప్పటికే మిళ్లర్లు, వ్యాపారుల మధ్య ధరకు ఇబ్బందిపడుతున్న రైతులు.. ఇప్పుడు ధాన్యం పూర్తిగా తడవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.