విదేశాలనుండి వచ్చారా?..అయితే మీరు తెలుసుకోవాల్సిందే...

Mar 17, 2020, 5:11 PM IST

జగిత్యాల జిల్లాలో విదేశాలనుండి వచ్చిన వారి కుటుంబాలకు వైద్యశాఖ కరోనా మీద అవగాహన కల్పిస్తుంది. ధర్మపురి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో  విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కుటుంబాలను వైద్య శాఖ, ఎం.పి.డి.ఓ, తహశీల్దార్, పోలీస్ అధికారులు, ఆశావర్కర్లు కలుస్తున్నారు. వారికి కరోనా మీద అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు.