జగిత్యాల : భార్యను కాపురానికి పంపలేదని...మేనమామను కాల్చాడు...

Feb 4, 2020, 12:13 PM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్ రాజుపల్లిలో భార్యను కాపురానికి పంపడం లేదని భర్త కాల్పులు జరపడం కలకలం రేపింది. తన భార్య గీతికను పంపించడం లేదని కోపంతో గీతిక భర్త ఫ్యాట  శ్రీనివాస్ గీతిక మేనమామపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన భైరం రాజిరెడ్డిని బంధువులు జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.