Mar 13, 2020, 5:50 PM IST
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. కవిత ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.