ఇంజనీర్స్ డే : మూసీ వరదల నుంచి భాగ్యనగరాన్ని కాపాడిన గ్రేట్ ఇంజనీర్..

Sep 15, 2020, 2:37 PM IST

దేశం గర్వించే ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తన అద్భుతమైన ప్రతిభతో ఆనకట్టలు, వంతెనలు, డ్యాంలు, సొరంగమార్గాలు ఇలా ఎన్నింటికో రూపకల్పన చేసి ఆయా నగరాల అభివృద్ధిలో ఎంతో దోహదం చేశారు. ఆ భారత రత్న జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారు.