విద్యార్ధుల కుటుంబాలను ఆదుకొంటాం: ఈటల (వీడియో)

Aug 28, 2019, 3:54 PM IST

వేములవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు చనిపోయిన ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులకు ప్రభుత్వమే చికిత్స అందిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు.