విషాదం : కరోనా మృతుడి అంత్యక్రియలకు కుటుంబసభ్యులు గైర్హాజరు...

Mar 30, 2020, 4:05 PM IST

హైదరాబాదులో కరోనా వైరస్ మృతుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరవ్వకపోవడంతో ఆరోగ్య కార్యకర్తలు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో మార్చి 29వ తేదీన ఓ వృద్ధుడు కరోనా వైరస్ తో మరణించాడు. అయితే అతను చనిపోయిన తరువాతే అతను కరోనాపాజిటివ్ ఉన్న విషయం తెలిసింది. దీంతో కుటుంబం అంతా క్వారంటైన్ లో ఉంది.