వాణి జయరాం మృతిపై అనుమానాలు... పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలిందిదే...

Feb 5, 2023, 5:04 PM IST

ప్రముఖ గాయనీ వాణీ జయరాం నిన్న(శనివారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై సినీ వర్గాలు, అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమె పోస్టుమార్టం రిపోర్టుతో ఈ అనుమానాలకు తెరపడింది. ప్రమాదం కారణంగానే ఆమె మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. ఇంట్లోని ఓ వుడెన్ టేబుల్ తగలడంతో వాణీ జయరాం తీవ్ర రక్తస్రావమై మృతిచెందినట్లు తేల్చారు. ఈ ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేరని సిసి టివి రికార్డ్ ద్వారా తెలుస్తోంది.