జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు... ముంబై లోకల్ ట్రైన్ వీడియో వైరల్

Oct 7, 2022, 10:58 AM IST

ముంబై : రెండు కొప్పులు ఒకేచోట ఇమడలేవని... మహిళలు కలిసుండటం కుదరని పని అని పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత ముంబై లోకల్ ట్రైన్ జుట్లు పట్టుకుని కొట్టుకోవడం చూస్తే నిజమే అనిపిస్తుంది. నవీ ముంబైలో ట్రైన్ లో సీటుకోసం ఇద్దరు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగి ట్రైన్ లో నానాబీభత్సం సృష్టించారు. వీరిని అదుపుచేయడానికి వచ్చిన మహిళా రైల్వే పోలీసుపై సైతం దాడిచేసి గాయపర్చారు. దీంతో ఇరువర్గాల మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.