Jan 28, 2020, 10:44 AM IST
తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ కరోనావైరస్ గురించి మీడియాతో మాట్లాడారు. “కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, అసలు రాకుండా మేము బాగా సిద్ధమయ్యాం, అన్ని ముందు జాగ్రత్త, నివారణ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు, రాష్ట్రంలోనే కాదు దేశంవ్యాప్తంగా కూడా ఎటువంటి కేసు గుర్తించబడలేదు. దీని గురించి అంత భయపడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ”అని డాక్టర్ సి. విజయభాస్కర్ తెలిపారు.