మా అమ్మ మృతదేహాన్ని త్వరగా తెప్పించండి..మోడీకి ఓ డాక్టర్ విజ్ఞప్తి

Feb 18, 2020, 10:05 AM IST

తన తల్లి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని ముంబైకి చెందిన డాక్టర్ పునీత్ మెహ్రా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. జనవరి 24 న మెల్బోర్న్ నుండి ముంబైకి బీజింగ్ మీదుగా బయలుదేరిన పునీత్ తల్లి చైనాలోని ఒక ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. కారణాలు తెలియదు కానీ మా అమ్మ మృతదేహం తీసుకొచ్చే పనులు ఇంకా మొదలవ్వలేదు. కరోనా వైరస్ కారణంగానే ఆపితే మాత్రం చెప్పలేం. అయినా ఆమె చనిపోయి చాలాకాలం అయ్యింది. ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆమె మృతదేహాన్ని వెంటనే రప్పించాలని ప్రధానికి కోరుతున్నాను అని పునీత్ మెహ్రా అన్నాడు.