శ్రీకాకుళంలో వలసకూలీలు వెడుతున్న ట్రావెల్స్ బోల్తా.. 33 మందికి గాయాలు

May 26, 2020, 10:19 AM IST

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుండి కోల్ కతా వెల్తున్న ఈ బస్సులో 42 మంది వలసకూలీలున్నారు. వీరంతా కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెడతుండగా మందస మండలం బాలిగాం వద్ద బస్సు బోల్తా పడింది. బాధితులంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు.