జేఎన్ యూ విద్యార్థి సర్జిల్ ఇమామ్ పై దేశద్రోహం కేసు

Jan 29, 2020, 11:27 AM IST

మంగళవారం నాడు న్యూఢిల్లీ పోలీసులు బీహార్ లోని జహనాబాద్ లో సర్జీల్ ఇమామ్ ను అరెస్ట్ చేశారు. అలీఘడ్ యూనివర్శిటీలో ఈ  ఏడాది జనవరి 16 వ తేదీన సర్జీల్ ఇమామ్ చేసిన ప్రసంగంపై  పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. బీహార్ నుండి ఇమామ్ ను ఢిల్లీకి తరలించారు. ఈ క్రమంలో పాట్నా విమానాశ్రయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మీడియా పర్సన్స్ మీద పోలీసులు చేయిచేసుకున్నారు. కెమెరామెన్లతో సహా నలుగురు మీడియా సిబ్బందికి గాయాలయ్యాయి.