కేరళ ఏనుగు మృతి : ఆకలితో దగ్గరికొచ్చిన మూగజీవాన్ని పొట్టనబెట్టుకున్న క్రూరులు..

Jun 4, 2020, 1:02 PM IST

కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఏనుగుకు మందుగుండు పెట్టిన పైనాప్పిల్ ఇచ్చిన ఘటనలో నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారికోసం అటవీశాఖ మాన్ హంట్ ప్రకటించింది.  గతనెలలో జరిగిన ఈ సంఘటన మీద సోషల్ మీడియా విరుచుకుపడింది. స్వయంగా ముఖ్యమంత్రి పినరై 
విజయన్ కల్పించుకుని దర్యాప్తుకు ఆదేశించారు. జీపీ ఎంపీ, జంతుహక్కుల కార్యకర్త మేనకాగాంధీ మలప్పురం దేశంలోనే చాలా క్రూరమైన జిల్లా అని అక్కడ ఇలాంటి సంఘటనలు మామూలే అని దుయ్యబట్టారు. దీంతో అటవీశాఖ  అధికారులు జూన్ 4న మ్యాన్ హంట్ ప్రోగ్రాం లాంచ్ చేసినట్టు 
ప్రకటించారు.