మా పెళ్లిని అంగీకరించండి..కేరళ హైకోర్టులో గే కపుల్ పిటిషన్...

Jan 29, 2020, 9:42 AM IST

కేరళ హై కోర్టులో ఓ గే జంట రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేరళ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ నిబంధనలు వివక్షా పూరితంగా ఉన్నాయని ఆరోపించారు. గే వివాహాలను చట్టబద్ధం చేయడానికి ఈ చట్టం ఆమోదించడం లేదని అన్నారు. 2018లో కేరళలోని గురువాయురప్ప దేవాలయంలో నిఖిష్ ఉషా పుష్పకరన్, ఎమ్మెస్ సోను అనే గే జంట ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వీరిద్దరూ ఏకమయ్యారు. అయితే వీరి వివాహానికి ఇప్పటికీ చట్టబద్ధత లభించలేదు. వీరే ఇప్పుడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.