కరోనావైరస్ మొదటి కేసు : సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం

Feb 1, 2020, 11:24 AM IST

దేశంలో మొదటి కరోనా వైరస్ కేసు కేరళలో గుర్తించబడడంతో వైద్యవ్యవస్థ అప్రమత్తం అయ్యింది. కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. దీన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా పర్యవేక్షిస్తోంది. కరోనా వైరస్ రావడానికి ఉన్న అన్ని అంశాలను.. ఇంకావ్యాపించకుండా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేరళ హెల్త్ మినిస్టర్ కెకె శైలజా అన్నారు.