రిపబ్లిక్ డే నాడు ఒక పనికొచ్చే పని...: బాలీవుడ్ తారలు

Jan 27, 2020, 3:52 PM IST

బాలీవుడ్ నటి దియా మీర్జా, చిత్ర నిర్మాత ప్రగ్యా కపూర్ జనవరి 26న ముంబైలో బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబై లోని మహీమ్ బీచ్‌లో క్లీనింగ్ ప్రోగ్రాం జరిగింది. క్లీనింగ్ డ్రైవ్‌లో పలువరు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. నటులు కరణ్ వాహి, మనీష్ పాల్, ఎల్నాజ్ నోరౌజీ బీచ్ క్లీనింగ్ లో సహాయపడ్డారు. అహానా ఎస్ కుమ్రా, దీప్షికా దేశ్ ముఖ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు దర్శకుడు ప్రగ్యా కపూర్, నిర్మాత అభిషేక్ కపూర్ భార్య. నటుడు చంకీ పాండేలు కూడా ఉన్నారు.