జామియా అల్లర్లు : డిసెంబర్ 15 నాటి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు

Feb 17, 2020, 3:57 PM IST

జామియా మిలియా ఇస్లామియా హింసకు సంబంధించిన డిసెంబర్ 15, 2019నాటి సిసిటివి ఫుటేజీని ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 16న విడుదల చేశారు. ఫుటేజీలో ఉన్న వ్యక్తులు అల్లర్ల అణిచివేత సమయంలో లైబ్రరీలో ఆశ్రయం పొందారని వారే అల్లర్లు సృష్టించారని తెలిపారు. అంతేకాదు కొంతమంది వ్యక్తులు చేతిలో రాళ్లతో విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోకి ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజ్ లో కనిపిస్తుంది.