vuukle one pixel image

బిజీ రోడ్డు మధ్యలో కాన్వాయ్‌ ఆపిన ఢిల్లీ సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 27, 2025, 1:00 PM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా బుధవారం హైదర్‌పూర్ ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఆమెకు ఆశ్రయం లేకుండా నడిరోడ్డుపై తిరుగుతున్న పశువులు కనిపించాయి. దీంతో వెంటనే కాన్వాయ్‌ని ఆపిన రేఖాగుప్తా కారు దిగారు. రోడ్లపై తిరుగుతున్న పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.