Chalo Vijayawada:పోలీసులను చూసి తగ్గేదేలే... విజయవాడకు ఉప్పెనలా కదిలిన ఉద్యోగులు

Feb 3, 2022, 1:23 PM IST

అమరావతి: కరోనా కారణాలు చూపి ఛలో విజయవాడకు పోలీసులు అనుమతి నిరాకరించారు... అయినా ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. విజయవాడకు వెళ్లకుండా అన్నివైపులా భారీగా పోలీసులు మొహరించారు... అయినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. పోలీసుల వలయాన్ని చేధించుకుని వేలాదిగా బీఆర్‌టీఎస్ రోడ్డుకు చేరుకున్న ఉద్యోగులు మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డంతా ఉద్యోగులతో నిండిపోయి ప్రభుత్వ, పీఆర్సీ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. అన్ని అవరోదాలను అధిగమించి ఏ మాత్రం తగ్గకుండా ఛలో విజయవాడను ఉద్యోగులు విజయవంతం చేసుకున్నారు.