Jan 13, 2022, 6:34 PM IST
పశ్చిమ బెంగాల్లో బికనీర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. పాట్నా నుంచి ఈ రైలు గౌహతి వెళుతోంది. జల్పాయ్గురి సమీపంలోని మేనాగురి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భారీగానే మరణాలు సంభవించి వుండొచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.