Galam Venkata Rao | Published: Feb 10, 2025, 2:01 PM IST
ఢిల్లీ ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీని కాదని బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. ఆఖరు ఆప్ ఛీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మాట్లాడారు. ఆప్, అరవింద్ కేజ్రీవాల్ ఓటమి గల కారణాలను వివరించారు.