Dec 8, 2019, 11:44 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో ఈ ప్రమాదంలో దాదాపు 43 మంది చనిపోయారని తెలుస్తోంది. అక్కడి ప్లాస్టిక్ తయారీ భవనంలో ఏర్పడిన మంటలు వల్ల విపరీతమైన పొగ రావడంతో ఊపిరాడక ఇంతమంది మరణించినట్లు అధికారులు తెలిపారు.