కవిత్వమై పరిమళించటంలో కవులు విఫలమవుతున్నారు - కవి సిద్దార్థతో ప్రత్యేక ఇంటర్వ్యూ

Aug 21, 2023, 1:20 PM IST

కవులు తమ భుజాలమీద ప్రజలను మోయాల్సింది పోయి రాజకీయాలను మోసుకుంటూ తిరుగుతున్నారు. అందుకే తెలంగాణ నుండి  బలమైన కవిత్వం రావడం లేదు.   కవులకు రాజకీయ అవగాహన ఉండాలి కానీ, రాజకీయాలే కవిత్వం కాదు అంటున్నారు కవి సిద్దార్థ.  ఏసియా నెట్ న్యూస్ తెలుగు సాహిత్య ప్రతినిధి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణ కవులకు ఇప్పుడు తెలంగాణ గురించి తెలిసింది పది శాతం మాత్రమే నని మిగతా తొంబై శాతం  తెలియకపోవడం తనను విషాదానికిలోను  చేస్తున్నదని  విచారం వ్యక్తంచేశారు.