ఆపరేషన్ సముద్రసేతు : ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులకు ఊరట..

Jun 25, 2020, 3:09 PM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చడంలో భాగంగా భారతీయ నౌక ఐఎన్ఎస్ జలాశ్వ ఈ రోజు ఉదయం ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకుంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించిన విషయం తెలిసిందే.