కరోనా వైరస్ : ఇటలీ ఎయిర్ పోర్టులో భారతీయుల పడిగాపులు

Mar 12, 2020, 12:07 PM IST

ఇటలీ లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడి రోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 64మంది భారతీయులు చిక్కకుపోయారు. షెల్టర్, ఆహారంలాంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాకు రావాలంటే కోవిద్ 19 నెగెటివ్ అనే డాక్టర్ రిపోర్ట్స్ తప్పనిసరి అని భారత్ ఆంక్షలు విధించడంతో తమను ఏ విమానమూ ఎక్కడానికి అనుమతించడంలేదని, ఇటలీలోని భారత ఎంబసీ కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతుందని వాపోతున్నారు.