అప్పుడు మారుతీరావు.. ఇప్పుడు లక్ష్మారెడ్డి.. ఏం సాధించారు??

Sep 26, 2020, 6:07 PM IST

మూడేళ్ల క్రితం అమృత, ప్రణయ్ లు. ఇప్పుడు హేమంత్, అవంతిలు. ఇద్దరూ కన్నతల్లిదండ్రుల కాఠిన్యానికి తమ నిండు జీవితాల్ని బలి ఇచ్చినవారే. హైదరాబాద్ చందానగర్ కు చెందిన హేమంత్, ఇంటి సమీపంలో ఉండే అవంతిలు గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. వారి ప్రేమకు అవంతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ యేడాది జూన్ 10న బిహెచ్ఈఎల్ సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. శుక్రవారం హేమంత్ హత్య చేయబడడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది