గుంటూరులో రోడ్డు ప్రమాదం...విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం (వీడియో)

Oct 16, 2019, 8:38 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల స్కూల్ ఆటో బోల్తా 20 మందికి విద్యార్థులు గాయపడ్డారు. గుత్తికొండ హైస్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని పిడుగురాళ్ల తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా  పడింది. ఈ ప్రమాదం నుండి పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి  జిల్లా పరిషత్ హైస్కూల్ చెందిన బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ విద్యార్థినులను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.