కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

Jun 21, 2020, 6:09 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 500 మందిపోలీసులు సామాజికదూరాన్ని పాటిస్తూ పాల్గొన్నారు.ఉదయం 6:15 గంటల నుండి 7:30గంటల వరకు ఈ యోగా కార్యక్రమం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి జి చంద్రమోహన్(పరిపాలన), ఏసిపిలు విజయసారధి,శ్రీనివాస్, ఎసిబిఐ ఇంద్రసేనారెడ్డి లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన అన్ని స్థాయిలకు చెందినపోలీసులు పాల్గొన్నారు