వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా సంక్రాంతికి విడుదలై భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ సందర్భంగా సోమవారం `సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక` నిర్వహించింది. ఈ సందర్భంగా టీమ్కి, డిస్ట్రిబిటర్లు, ఎగ్జిబిటర్లకి షీల్డ్ లు ప్రధానం చేశారు. ఇందులో దర్శకుడు వంశీపైడిపల్లి పాల్గొని తన థర్డ్ క్లాస్ స్టోరీ చెప్పి నవ్వించారు.