లైనేస్తే ఒక్క అమ్మాయి కూడా పడలేదు

Oct 8, 2024, 11:23 PM IST

మెగా బ్రదర్‌ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన కూతురు నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా 50వ రోజు వేడుకకి గెస్ట్‌గ హాజరై సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నారు. టీనేజ్‌ లో అమ్మాయిలకు లైనేస్తే ఒక్కరు కూడా పడలేదని, మామూలుగా ఉండే పోరగాళ్లకి పడేవాళ్లని, చాలా బాధగా అనిపించేందని గుర్తుచేసుకున్నారు. ఎవరైనా బాగా డాన్సులు చేస్తే చెడగొట్టేవాళ్లమని, కొన్ని పాడు పనులు చేయాల్సి వచ్చేదని చెప్పారు నాగబాబు.