తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకుడిగా తెరకెక్కించిన మూడో చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. కాగా, ధనుష్ అక్క కొడుకు పవిష్ హీరోగా ఈ సినిమాతో పరిచయం కానున్నారు. పవిష్ సరసన అనికా సురేంద్రన్ నటించగా, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, సతీష్, వెంకటేష్, రమ్య రంగనాథన్, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ టీం పలు విశేషాలను పంచుకుంది.