డేంజర్ జోన్‌లో విష్ణుప్రియ, సీత మెగా చీఫ్‌గా మెహబూబ్.. పోటీ ఇచ్చిన మణికంఠ

Oct 12, 2024, 10:43 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో వారం మెగా చీఫ్‌గా మెహబూబ్ ఎన్నికయ్యాడు. టాస్క్ పరంగా అతను కంప్లీట్ చేయలేకపోయినా.. అందరికింటే ఎక్కువ సేపు బాలెన్సింగ్ గేమ్ లో ఉండటంతో అతను మెగా చీఫ్ అయ్యాడు. అలా చూసుకుంటే గాలి గట్టిగా వీచకపోయి ఉంటే.. హరితేజ గానీ, మణికంఠ గానీ మెగా చీఫ్ అయ్యేవారు. చిన్న లక్కు పాయింట్‌లో మెహబూబ్ మెగా చీఫ్ అయ్యాడు. సో ఈవారం ఎలిమినేషన్ ఎవరు అనేది ఉత్కంఠగా మారంది. విష్ణు ప్రియను ఫ్యాన్స్ కాపాడుతుంటే.. తన కింద తానే కొరివి పెట్టుకుంటుంది. సీత కూడా డేంజర్ జోన్‌లోనే ఉంది. యష్మికి ఎక్కువ నామినేషన్లు పడినా కూడా ఈ వారం ఆటతీరుతో ఆమె తన యాంటీ ఫ్యాన్స్‌ను కూడా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. మరి నాగార్జున క్లాస్ పీకేది ఎవరికి..? ఎలిమేట్ అయ్యేది ఎవరు? అనేది చూడాలి.