వైల్డ్ గా నామినేషన్లు.. యష్మి, సీత పని ఔట్ పృథ్వీకి పోటీగా గౌతమ్

Oct 8, 2024, 8:52 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అసలైన ఆట ఐదు వారాల తర్వాత మొదలైంది. 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ హౌస్ మరోసారి కొత్త ఎపిసోడ్ లా కళకళాడుతోంది. నామినేషన్స్ విషయంలో మళ్లీ సింపతీ స్టార్ మణికంఠ సెంటర్ పాయింట్ అయ్యాడు. మణికంఠను మధ్యలో పెట్టి.. యష్మిని వరుసగా నామినేట్ చేశారు. ఈ క్రమంలో మణిపై సొంత క్లాన్ సభ్యులే మళ్లీ పగ పెంచుకుంటున్నారు. ఇక వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో పాత ఇంటి సభ్యులంతా బిక్కముఖం వేయక తప్పలేదు.