పృథ్వి దద్దోజనం.. సోనియా సైకో డబుల్ గేమ్ ఆడుతున్న నిఖిల్

Sep 25, 2024, 8:25 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కాంతార టీమ్ కు కొత్త చీఫ్ గా Kirrak సీత గెలిచింది. అంతకు ముందు ఒకరికి మరొకరు వెన్నుపోట్లు పోడుచుకుని మరీ.. చీఫ్ అయ్యే అవకాశాలు పోగొట్టుకున్నారు. ఇక హౌస్ లో నా ఆట సాగుతుంది అనుకున్న సోనియాకు యష్మి గట్టిగా ఇచ్చిపడేసింది. యష్మి తీసిన పాయింట్స్ కు సోనియా బిక్కముఖం వేసింది. ఇక ఎప్పటిలాగానే సోనియా చుట్టూ తిరుగుతూ పృథ్వి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఇప్పటికే పృథ్వీకి దద్దోజనం అన్న పేరు వచ్చేసింది. సోనియాకు సైకో అని పేరు పెట్టేశారు. నిఖిల్ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ సేఫ్ ప్లేయర్ అనిపించుకుంటున్నాడు.