అంతా మణికంఠే చేశాడు.. ఈసారి యష్మి ఎలిమినేషన్ పక్కా!

Oct 9, 2024, 10:46 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో వారం నామినేషన్ల కథ కంప్లీట్ అయ్యింది. ఫైనల్ గా కొత్త సభ్యుల నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం పాత ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. ఇక వారిలో దిల్ సే మెహబూబ్ తో పాటు గంగవ్వను నామినేట్ చేశారు. మొత్తంగా నామినేషన్స్ లో యష్మి, సీత, విష్ణు ప్రియ, పృధ్వీ, గంగవ్వ, మెహబూబ్ ఉన్నారు. ఇక హౌస్ లో రేషన్ రచ్చ కొనసాగింది. ముందు నుంచి అనుకునట్టుగానే గౌతమ్, నబిల్ విషయంలో అగ్గి రాజుకుంటుంది. అది ఎప్పుడు మంటగా మారుతుందో చూడాలి.