NTR Jayanthi: నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం... బాలకృష్ణ

May 28, 2022, 10:28 AM IST

తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని సినీనటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని అన్నారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించాం అన్నారు.యువకులు రాజకీయాల్లోకి రావాలి.. ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని.. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారన్నారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లడతా అన్నారు.