పౌష్టికాహారంపై మంత్రి తానేటి వనిత సమీక్ష

Feb 25, 2020, 4:12 PM IST

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆర్జెడి, పిడిలతో పౌష్టికాహారం సరఫరా పై ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విశాఖపట్టణంలో సమీక్ష నిర్వహించారు . ప్రభుత్వం దీని కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే మనం దాన్ని సక్రమంగా అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. అధికారులు ఒకేచోట ఉండకుండా అన్ని ప్రాంతాలకు తిరిగి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.