రెడ్ జోన్ లో తెరుచుకున్న వైన్ షాపు.. బారులు తీరిన మందుబాబులు...

May 25, 2020, 11:59 AM IST

గుంటూరు జిల్లా , దాచేపల్లి మండలం , గామాలపాడులో కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. దాచేపల్లి మండలం రెడ్ జోన్ లో ఉంది. దీంతో ఇక్కడ వైన్ షాపులు తెరవడంతో మద్యం ప్రియులు బారులు తీరారు. రెడ్ జోన్ అంటూ నిత్యావసరాలకు ఉదయం తొమ్మిదివరకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం వైన్ షాపును మాత్రం సాయంత్రం వరకు అనుమంతించదని స్థానికులు మండిపడుతున్నారు.