Video news : ఈ క్రాప్ ద్వారా రైతులు పండించిన ప్రతి గింజ కోనుగోలు చేస్తాం

Dec 2, 2019, 12:45 PM IST

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కోనుగోలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం పరిధిలోని రాయనపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. అన్ లైను విధానంలో ధాన్యం కొనుగోలు జరుగుతుందని ఈ క్రాప్  నమోదు చేసి రైతులు పండించిన ప్రతి గింజ కోనుగోలు చేయనున్నట్లు తెలిపారు.