Tirumala Tickets Scam: TTDలో దొంగల దోపిడీ | దేవుడి టికెట్లతో రోజా, పెద్దిరెడ్డి వ్యాపారం

Sep 29, 2024, 9:06 PM IST

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినవన్నీ స్కాములు, దోపిడీలేనని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్కే రోజా శ్రీవారి టికెట్లను అమ్ముకొని వ్యాపారం చేశారన్నారు. కళాధర్‌ ట్రావెల్స్‌, బుక్‌ మై దర్శన్‌ సైట్‌ను అడ్డుపెట్టుకొని రోజుకి రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు మాజీ మంత్రులిద్దరూ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక జగన్‌ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు.