చచ్చిపోదామనుకుంది..పిల్లల్ని చంపింది...ఆ తరువాత....

Mar 21, 2020, 5:18 PM IST

కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జనిత అనే మహిళ తన ఇద్దరు పిల్లలను నీళ్లతొట్టిలో ముంచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే..మూడేళ్లు, సంవత్సరం వయసున్న ఇద్దరు ఆడపిల్లల్ని ఇంటిబయటున్న నీళ్లతొట్టిలో వేసిన కన్నతల్లి..ఆ తరువాత విజయవాడలో రైలుకింద పడబోయింది. కాపాడిన రైల్వే పోలీసలు ఆరా తీస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.