మహిళలు స్నానాలు చేస్తుంటే.. డ్రోన్ వీడియోలు తీసామనేది అవాస్తవం

Feb 22, 2020, 8:51 AM IST

అమరావతి గుంటూరు జిల్లా తుళ్ళూరు మందడం ఘటనపై తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మందడంలో జరిగిన ఘటనపై పోలీసుల మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. మహిళలు స్నానాలు చేసేటప్పుడు డ్రోన్ ద్వారా వీడియోలు తీసారనేది అవాస్తవమని, బూటు కాలితో తన్నినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. రోజాను 
అడ్డుకున్నవారిపై మాత్రం కేసులు నమోదు చేశామని అన్నారు.