టీటీడీ ఆస్తుల రచ్చ : ఉపవాస దీక్షలో కన్నా లక్ష్మీ నారాయణ

May 26, 2020, 11:17 AM IST

తమిళనాడులో ఉన్న టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షలు సాగిస్తారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయయణతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.