ట్రిపులెట్స్ : విశాఖలో వింత..ఒకే కాన్సులో ముగ్గురు...

Feb 3, 2020, 9:31 AM IST

విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి హర్షోకు ఇంట్లో ప్రసవం జరిగింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. కొద్ది సేపటికి తిరిగి నొప్పులు ప్రారంభం కావడంతో పాడేరులోని  జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరో ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యాధికారి కృష్ణారావు తెలిపారు. ముగ్గురు పిల్లలు జన్మించడం విశాఖ మన్యంలో ఇదే మొదటిసారని అన్నారు. హర్షోకి ఇది ఐదవ కాన్పు.